Sunday, January 20, 2008

కేబుల్ ఆపరేటర్లను భయపెడుతున్న ' సన్ డైరెక్ట్ '

వినియోగదారులు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న సన్ నెట్ వర్క్ వారి డిటిహెచ్ సర్వీస్ 'సన్ డైరెక్ట్' చాలా సైలెంట్ గా రాష్ట్రంలోకి ప్రవేశించింది. తమిళ నాడులో ఏకచత్రాధి పత్యంగా నడుస్తున్న తమ సుమంగళి కేబుల్ విజన్ కు ఎనాటికైనా ముప్పుతప్పదని భావించిన మారన్ బ్రదర్స్ డిటిహెచ్ సర్వీసులు ప్రారంభించాలని మూడేళ్ళ క్రితమే ప్రణాళికలు తయారు చేసుకున్నారు. ఈలోగా దినకరన్ వివాదంతో కరుణానిధికి మారన్ సొదరులు దూరమయ్యారు. ఇదే అదనుగా కరుణానిధి కేబుల్ సర్వీసులను ప్రభుత్వం స్వాధీనం చేసుకునేలా జయలలిత ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్ ను చట్టబద్దం చేసేశారు. మారన్ సోదరులు యుద్ద ప్రాతిపదికన 'సన్ డైరెక్ట్' డిటిహెచ్ సర్వీసులను నాలుగు దక్షిణాది రాష్ట్రాల్లో ప్రారంభించారు.
డిష్ రూ.1999/- + నెల అద్దె రూ 75/- ( ఏడాది పాటు ఫ్రీ)

'సన్ డైరెక్ట్' కేవలం 1999 రూ.లకే వినియోగదారులకు అందిస్తున్నారు. నేలు 75 రూ.లకే 75 టీవీ ఛానెళ్ళు, 15 రేడియో చానెళ్ళు ఇవ్వడం సన్ డైరెక్త్ ప్రత్యేకత. పైగా ఏడాది పాటు నెలవారి బిల్స్ ఉండవు. రాష్ట్ర మార్కెట్లో ఇప్పటికే అందుబాటులో ఉన్న టాటా స్కై, డిష్ టీవీ, డిడి డైరెక్ట్ డిటిహెచ్ సర్వీసులకన్నా 'సన్ డిరెక్ట్' చాలా చౌక.

ఆందోళనలో కేబుల్ ఆపరేటర్లు

తమ ఉపాధికి ముప్పుగా మారిన సన్ డైరెక్ట్ సర్వీసులపై కేబుల్ ఆపరేటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఒకసారి హైదరాబాద్ లోని జెమిని టీవీ ఆఫీస్ ముందు ఒక రోజంతా ధర్నా జరిపారు. జెమిని, జెమిని న్యూస్, జెమిని మ్యూజిక్, తేజ ఛానెళ్ళను పే ఛానెళ్ళుగా మార్చి తమ నుండి కోట్లాది రూపాయలు ముక్కు పిండి వసూలు చేస్తున్న సన్ గ్రూప్, సొంతంగా ప్రారంభించిన డిటిహెచ్ సర్వీస్ ను చౌకగా ఇవ్వడంలోని ఆంతర్యాన్ని వారు ప్రశ్నిస్తున్నారు.

మరో ఈస్టిండియా కంపనీ 'సన్ గ్రూప్'

ఆంగ్లేయులు మన దేశంలోకి ఈస్టిండియా కంపనీ ముసుగులో వచ్చి ఇక్కడి వ్యాపారాలన్నింటినీ దివాళా తీయించి సంపదను తమ దేశానికి తరలించుకు పోయిన వైనాన్ని మనం చరిత్రలో చదువుకున్నాం. టీవీ ఛానెళ్ళు, కేబుల్ - డిటిహెచ్ వ్యాపారాల విషయంలో సన్ గ్రూప్ మన రాష్ట్రంలో ఇదే విధానాన్ని అవలంభిస్తోందనే విమర్శలున్నాయి. తమిళనాడులో తమ ఛానెళ్ళను ఉచితంగా అందిస్తున్న సన్ నెట్ వర్క్, ఆంధ్ర ప్రదెశ్ లో మాత్రం పే ఛానెళ్ళ పేరిట ఆపరేటర్ల వద్ద కోట్లాది రూపాయల్ని జబర్దస్తీగా వసూలు చేస్తోంది. ఇప్పుడు 'సన్ డైరెక్ట్' పేరిట ఏకంగా కేబుల్ ఆపరేటల ఉపాధినే దెబ్బ తీస్తోంది. తమ తమిళ ఛానెళ్ళ సిబ్బందికి భారీగా జీతాలు ఇచ్చే సన్ గ్రూప్ తెలుగు ఛానెళ్ళ ఉద్యోగులకు మాత్రం ముష్టి జీతాలు విదులుస్తోంది. ఇతర తెలుగు ఛానెళ్ళతో పోలిస్తే ' జెమిని ' ఉద్యోగుల వేతనాలు నీచాతి నీచం. ఇదేమి వివక్షత? ఆంధ్రా మార్కెట్ నుండి కొల్లగొట్టుకు పోతున్న సంపదతో మారన్ సోదరులు విమానయాణ, హోటల్ వ్యాపారాలను పెద్దగా విస్తరిస్తున్నారు. కాని జెమిని ఉద్యోగుల జీతాలను మాత్రం పెంచటక పోవడం ఏం న్యాయం?