Tuesday, January 8, 2008

టీవీ-5లో కుల రాజకీయాలకు భాస్కర్ బలి

టీవీ-5లో వెర్రి తలలు వేస్తున్న కుల రాజకీయాలకు ఆ ఛానెల్ బ్యూరో చీఫ్ భాస్కర్ బలి అయ్యాడు. ఇది అత్యంత జిగుస్సాకరమని స్వయానా ఆ ఛానెల్ వారే అంటున్నారు. టీవీ-5లో తనకు తాను అపర మేధావినని భావించే సుబ్బారావు అనే టిడిపి బీట్ రిపోర్టర్ ఆడిన క్రూర రాజకీయాలకు చెక్ పెట్టే ప్రయత్నం చేయడమే భాస్కర్ చేసిన నేరం. సుబ్బారావు వ్యవహారాలు తెలిసిన టీవీ-5 యాజమాన్యం ఒక దశలో అతన్ని సస్పెండ్ చేసింది. అయితే కుల లాబీని అడ్డు పెట్టుకొని తిరిగి వచ్చిన సుబ్బారావు ఏకంగా భాస్కర్ కే పొగ పెట్టాడని ఆ ఛానల్ వర్గాల బోగట్టా.. సదరు సుబ్బారవు గారికి 'ఈనాడు టు ఆంధ్రజ్యోతి టు ఎన్-టీవీ టు టీవీ-5'కు వచ్చిన ఓ సీనియర్ జర్నలిస్ట్ సామాజిక మద్దతు పుష్కలంగా ఉందిట. తప్పుడు వార్తలు ఇవ్వడంలో దిట్ట అయిన సుబ్బారావు వ్యవహార శైలిపై టీడీపీ బీట్ రిపోర్టర్లు, ఆ పార్టీ నేతలు కథలు కథలుగా చెప్పుకుంటుంటారు. ఇద్దరు మహిళా జర్నలిస్టులతో క్లోజ్ గా తిరిగే సుబ్బారవు తన ప్రేమను చాటుకునేందుకు అర చేయి కూడా కోసుకున్నాడట(?)