Monday, July 19, 2010

ఆ రెండు కోట్ల కథేంటి?

హైదరాబాద్ జర్నలిస్ట్ వర్గాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ ఇదే. ఒక చానెల్ కు చెందిన ఘరానా రిపోర్టర్ ఒక భూమి వివాదం సెటిల్ చేయించడానికి రెండు కోట్ల రూపాయల ఒప్పందం కుదుర్చుకున్నాడట. ఈ వ్యవహారం ఎక్కడో బెడిసి సదరు చానెల్ యాజమాన్యానికి తెలిసిపోయింది. ఎవరో వీడియో తీసి సీడీలు వారికీ పంపారట. సదరు యాజమాన్యం వారు వెంటనే ఈ రిపోర్టర్ చేత రిజైన్ చేయించారు. వారం రోజుల్లో ఈ కారణ జన్ముడికి మరో చానెల్లో ఏకంగా చీఫ్ ఎడిటర్ ఉద్యోగం దొరికింది. ఈ వాస్తవ కథలో పాత్రల పేర్లు సాయి, టీవీ-9 , జెమిని.. మరో మూడు మీడియా సంస్థల రిపోర్టర్ ల పేర్లు కూడా ఈ వ్యవహారంలో వినిపించినా, వారికి ఏ పాపం తెలియదని అందరు నమ్ముతున్నారు (?) జెమిని సంస్థ ఇంత సచ్చీలుడికి అంత పెద్ద ఉద్యోగం ఇవ్వడం లోని మతలబు ఏమిటో? అసలు జెమిని యాజమాన్యం ఇతగాడి గత చరిత్ర తెలుసుకొనే ఉద్యోగం ఇచ్చింద?
టీవీ 9 కు మాధవ్ రాజీనామా
టీవీ - 9 కు మరో షాక్. సీనియర్ జర్నలిస్ట్ మాధవ్ ఆ చానెల్కు రాజీనామా ఇచ్చేశాడు. జెమినిలో చేరడానికే రాజీనామా చేశాడని తెలిసింది. రవిప్రకాష్ నమ్మిన బంటు మాధవ్ రాజీనామాకు కారణం ఏమిటి? గతంలో రెండు సార్లు జెమినిలో పని చేసి అవమానకర పద్దతిలో రాజీనామా చేసిన మాధవ్ మళ్ళీ ఆ చానెల్లో ఎందుకు? చేరుతున్నాడు? నిజం నిలకడ మీదే తెలియాలి. మరో వైపు ఇటీవలే టీవీ 9 నుండి బయటకు వచ్చిన ఆలపాటి సురేష్, రవిప్రకాష్ మరో నమ్మిన బంటు గంగాధర్ కూడా జెమినిలో చేరుతున్నట్లు ప్రచారం జరుగుతోంది?