Sunday, July 11, 2010

ఉప ఎన్నికల్లో పెయిడ్ ఆర్టికల్స్ పై ఇ.సి. నిఘా

రాష్ట్రంలోని 10 అసెంబ్లీ నియోజక వర్గాలకు జరుగుతున్న ఉప ఎన్నికల సందర్భంగా ఎన్నికల కమిషన్ పెయిడ్ ఆర్టికల్స్ పై ప్రత్యేక నిఘా పెట్టినట్లు సమాచారం. గత పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల సమయంలో పలు పత్రికలూ, చానెళ్ళు అభ్యర్థుల దగ్గర డబ్బు తీసుకొని ప్రత్యేక వార్తలు, స్టోరీలు ఇచ్చాయి. డబ్బు ఇవ్వలేని అభ్యర్థులకు మీడియాలో సరైన ప్రచారం జరగలేదు. ఈ అమ్ధంపై దేశ వ్యాప్తంగా చర్చ జరిగింది. ప్రెస్ కౌన్సిల్ కూడా ఈ వ్యవహారంపై విచారం వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఎన్నికల కమిషన్ పెయిడ్ వార్తలను అరికట్టడం పై దృష్టి సారించినట్లు తెలిసింది.