Wednesday, March 4, 2009

నిరాశ పరచిన సాక్షి టీవీ

భారీ ప్రచారం - పట్టుబడులతో, ఎన్నో ఊహాగానాల మధ్య ప్రారంభమైన సాక్షి టీవీ చానెల్ ప్రేక్షకులను ఎంతో నిరాశ పరచింది. దేశంలోనే తొలిసారిగా అధునాతన హెచ్.డి. టెక్నాలజీని ఉపయోగించిన సాక్షి టీవీ, బుల్లి తెరపై నాసిరకంగా కనిపిస్తోంది. లోపం ఎక్కడున్నట్లు? న్యూస్ బులటిన్లు, ఇతర కార్యక్రమాలు కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో లేవు. ప్రోమోలు అన్నీ డల్ గా ఉన్నాయి. సాక్షి కి పెట్టిన పెట్టుబడితో ఏకంగా మూడు చానెళ్ళు పెట్టుకోవచ్చు. ఇంత ఖర్చు పెట్టి ఏమి లాభం? అసలు సిబ్బంది ఎంపికలోనే లోపం ఉందని జర్నలిస్ట్ మిత్రులు అంటున్నారు. సాక్షిలో పైరవీల ఆధారంగానే సిబ్బంది ఎంపిక జరిగిందనేది కాదనలేని నిజం. ఇప్పటికైనా సాక్షి జయమాన్యం టీం ను మార్చాల్సిన అవసరం ఉంది.