Sunday, March 30, 2008

వెంకట ' కృష్ణ లీలలు '

దురదృష్ట వశాత్తు ప్రతిభ ఉన్న మీడియాలో గుర్తింపు రాక మరుగున పడ్డ జర్నలిస్టులెందరో ఉన్నారు. గుర్తింపు రావాలంటే ప్రతిభ ఒక్కటే చాలదు. కులం, కాకా పట్టే విద్య కూడా కావాలి. ఆ లక్షణాలన్నీ ఉండబట్టే పర్వతనేని వెంకటకృష్ణ ఈటీవీలో ఒక వెలుగు వెలుగున్నాడు. లేకపోతె వరంగల్ జిలా పర్వతగిరి కాంట్రబ్యూటర్ గానే కొనసాగే వాడేమొ? ' పట్టు ' కళలో ఆరితేరిన వెంకటకృష్ణ ఈటీవీలో సీనియర్లందరిని సాగనంపాడు. కొందరు సీనియర్లు ' ఫిలింసిటీ ' దాటి బయటకు రాకుండా కట్టడి చేయగలిగాడు. ప్రస్తుతం వెంకటకృష్ణను ఫోర్జరీ కేసు వెంటాడుతోంది. ప్రభుత్వం ఇస్తున్న ఇళ్ళ స్థలాల కోసం రామోజీ ఫిలింసిటీలో ఉండే చాలా మంది సీనియర్ జర్నలిస్టులకు అప్లికేషన్లు అందకుండా వెంకటకృష్ణ అడ్డుకున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. దరఖస్తు చేసుకున్నా వారిలో 15కు పైగా అనర్హులు ఉన్నారని తెలుస్తోంది. ఈటీవీ నుండి దరఖాస్తు చేసుకున్న కొందరు సీనియర్ జర్నలిస్టుల పేర్లు జాబితాలో చోటు చేసుకోలేదు. తనకు గిట్టని వారి పేర్లు అర్హుల జాబితాలో చోటు చేసుకోకుండా వెంకటకృష్ణ సాయశక్తులా ప్రయత్నించాడు. ఎలక్ట్రానిక్ మీడియా హౌసింగ్ సొసైటీ స్క్రూటినీ కమిటీ సమావేశంలో ఈటీవీ నుండి ఒక పేరు కచ్చితంగా ఉండాలని వెంకటకృష్ణ గట్టిగా పట్టు పట్టదు. ఆ పేరు వెంకటకృష్ణ ప్రియురాలిది. ఈటీవీలో చాలా కాలంగా పని చేస్తున్నట్లు ఒక ఫోర్జరీ లేఖను ఈ దరఖాస్తు వెంట దాఖలు చేశాడు. అసలు ఈమె ఎవరా అని విచారిస్తే ఆవిడకి ఈటీవీతో ఎలాంటి సంబందం లేదని బయట పడింది. ఆమె ఒక అగ్ర దర్శకుడి పీ.ఆర్.ఓ. వెంకటకృష్ణ ఫొర్జరీ వ్యవహారం ఈటీవీ యాజమాన్యం దృష్టికి వెళ్ళి oది. పాపం వెంకటకృష్ణకు కష్ట కాలం మొదలైంది. అదృష్టవశాత్తు ఎలక్ట్రానిక్ మీడియా హౌసింగ్ సొసైటీ జాబితాను జవహర్ లాల్ నెహ్రు హౌసింగ్ సొసైటీ పక్కన పెట్టింది.

సాక్షి విశ్వ రూపం

మార్చి 24న, 23 ఎడిషన్లతో ప్రారంభమైన ' సాక్షి ' దిన పత్రిక తెలుగు మీడియా చరిత్రను తిరగ రాసింది. అంతే కాదు ఒకేసారి అత్యధిక ఎడిషన్లతో ప్రారంభమైన దిన పత్రికగా గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కబోతోంది. తక్కువ ధరతో, అన్ని పేజీలు రంగులతో, అత్యాధునిక అంతర్జాతీయ పేజీ లేఔట్ తో, సరికొత్త శీర్షికలతో వెలువడుతున్న సాక్షిని చూసి తోటి దిన పత్రికలు దిమ్మ తిరిగిపోయాయి. సాక్షి రాకకు కారణాలు ఏమున్నా సరి కొత్త రూపంలో తెలుగు వారి ముందుకు వచ్చిన ఈ పత్రికను ప్రతి ఒక్కరూ స్వాగతించాల్సిందే. సాక్షి రాకతో ఈనాడు, ఆంధ్రజ్యోతి, వార్త దిన పత్రికలు తమ రూపాన్ని సమూలంగా మార్చుకోక తప్పదు. కాగా సాక్షిలో రంగులు ఎక్కువై విషయానికి ప్రాధాన్యత తగ్గుతోందనే విమర్షలు ఉన్నాయి. పొలిటికల్ రిపోర్టింగ్ వీక్ అని విశ్లేషకులు అంటున్నారు. ఇవన్నీ గాలిబుడగల్లాంటివే. కొత్తదనానికి పాఠకులు క్రమంగా అలవాటు పడటం ఖాయం. మరో వైపు సాక్షి కొన్ని చోట్ల మార్కెట్లోకి ఆలస్యంగా వస్తొంది. పత్రికను బుక్ చేసుకున్న పాఠకుల ఇళ్ళకు చేరటం లేదు. ఈ బాలారిష్టాల నుడి బయట పడాలని కొరుకుందాం. విష్ యూ ఆల్ ద బెస్ట్ సాక్షి

మీడియా కామాంధుడు

సైకిల్ దొంగగా నేరమయ జీవితాన్ని ఆరంభించిన ఓ ఒంగోలు చిన్నోడు కెమెరా అసిస్టెంట్ గా ఎలక్ట్రానిక్ మీడియాలోకి అడుగు పెట్టాడు. పుష్కర కాలంలోనే ఔట్ పుట్ ఎడిటర్ అయిపోయాడు. కోట్లాది రూపాయల విలువైన ఆస్తుల్ని కూడబెట్టాడు. ఈ కథ ఇంతటితో అయిపోలేదు. హిచ్ కాక్ సినిమాను మించిన సస్పెన్స్ తో కొనసాగుతోంది. కామం ప్రకోపించిన ఈ చిన్నోడు ఆడవాళ్ళ జీవితాలతో ఆటలు మొదలెట్టాడు. మతాన్ని అడ్డు పెట్టుకొని కట్టుకున్న ధర్మపత్నికి ద్రోహం చేశాడు. విచ్చలవిడి లైంగిక సంబంధాలు కొనసాగించాడు(కొనసాగిస్తున్నాడు) కొందరిని పెళ్ళాడాడు. కొందరితో కలిసి జీవిస్తున్నాడు. ఏక కాలంలో తల్లీ కూతుర్లతో సంబంధం పెట్టు కున్నాడట(?) చిన్నోడి అకృత్యాలను, వేదింపులను భరించలేని భార్య పోలీసుల్ని, న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. లక్షలాది రూపాలు వెదజల్లి చట్టం దృష్టినుండి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు చిన్నోడు. తాజాగా ప్రేమ పేరిట మరో న్యూస్ యాంకర్ని వలలో వేసుకొని పెళ్ళాడు. పాపం చిన్నోడి గత చరిత్ర ఆవిడకు తెలియదేమో.. చిన్నోడి లీలలు ఒక్కొకటి బయటకు రావడంతో ఇతగాడు పనిచేస్తున్న ఛానెల్ ఊద్యోగంలోంచి తీసేసింది. (ఇతగాడి గురించి ఎబౌట్ తెలుగు మీడియా ముందుగానే హెచ్చరించినా సదరు ఛానెల్ కళ్ళు మూసుకొని ఉద్యోగం ఇచ్చింది. అది వేరె కత లెండి) ప్రస్తుతం కనబడకుండా పోయిన చిన్నోడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈతడి గత చరిత్రను పోలీసులు ఆరా తీస్తున్నారు. చిన్నోడి మీద ఎన్నో కేసులు నమోదయ్యాయట. దురదృష్టవశాత్తు మన మీడియా అన్ని రకాల నేరగాళ్ళ అడ్డాగా మారిపోయిందనటానికి చిన్నోడి కథే సాక్షం. మెరుగైన సమాజ పూర్వ విద్యార్థి చిన్నోడు ఎవరో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదనుకుంటాం..

Sunday, March 2, 2008

జెమినిలో ఏం జరుగుతోంది?

జెమిని టీవీలో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలు అక్కడ పని చేస్తున్న ఉద్యోగులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. శ్రమ దోపిడీకి మారు పేరైన జెమినిలో జీతాలు ' గొర్రె తోక బెత్తెడు ' లాంటివని అందరికి తెలుసు. ఇతర తెలుగు ఛానెళ్ళతో పొలిస్తే జెమిని సిబ్బంది జీతాలు నాలుగో వంతు మాత్రమే. కొత్తగా వస్తున్న ఛానెళ్ళు భారీగా వేతనాలు ఆఫర్ చేస్తుండటంతో జెమిని నుండి వలసలు నిత్యకృత్యంగా మారాయి. జరుగుతున్నా జెమిని గ్రూప్ ఛానెళ్ళను నిర్వహిస్తున్న ' సన్ ' యాజమాన్యంలో కనీస స్పందన లేదు. అసలు హైదరాబాద్ లో జరుగుతున్న పరిణామాలు చెన్నై లోని సన్ యాజమాన్యానికి తెలుసా? ఆంధ్ర ప్రదేశ్ లో ఛానళ్ళరూపంలొ వందలాది కోట్లు ఆర్జించే సన్ యాజమాన్యం జెమిని ఉద్యోగులకు మెరుగైన జీతాలు ఇవ్వక పోవడానికి కారణం ఏమిటి? గ్రేటర్ హైదరాబాద్ లో పెరిగిన ఇళ్ళ అద్దెలు, నిత్యావసర వస్తువుల ధరలు తట్టుకోలేక ఆప్పుల ఊబిలో కూరుకు పోతున్న ఉద్యోగులపై యాజమాన్యానికి కనికరం లేదా? ఉద్యోగులు వలస పోతున్న ప్రతిసారీ జీతాలు 50-100-200 రెట్లు పెరుగుతాయని జెమిని స్థానిక యాజమాన్యం పుకార్లు లేవదీస్తోంది. నిజమని నమ్మిన జెమిని ఉద్యోగులు ఇతర ఛానళ్ళలో వచ్చిన అవకాశాల్ని వదులుకొని, చివరకు అంతా మోసమని తెలుసుకొని విచారించటం సర్వ సాధారణమైంది. తాజాగా ఏప్రిల్,మేల్లో జీతాలు డబుల్ అవుతాయని నమ్మ బలుకుతున్నారు. స్థానిక యాజమాన్య వైఫల్యం వల్లే జెమిని సిబ్బందికి జీతాలు పెరగటం లేదని తెలుస్తోంది. పైరవీలకే పరిమితమైన జెమిని స్థానిక యాజమాన్యం ఉద్యోగుల ఆకలి కేకల్ని ' చెన్నై ' దృష్టికి తీసుక పోవటంలో విఫలమవుతున్నారు. వీరికి సన్ సీ.ఎం.డి. కళానిధి మారన్ అపాయింట్మెంట్ దొరకదని జెమిని వర్గాలు చెబుతున్నాయి. లక్షలాది జీతాలు తీసునే స్థానిక జెమిని ఎం.డి., జి.ఎం.లు తమ సిబ్బంది వేతనాల వెతల్ని ఎందుకు అర్థం చేసుకోవడం లేదు?
దీని అర్థమేమి తిరుమలేశా?

జెమిని నుండి మరో వారం రోజుల్లో 30కి పైగా ఉద్యోగులు ఏసియానెట్ తెలుగు ఛానెళ్ళో చేరి పోతున్నారు. ముంచుకొస్తున్న ముప్పును చూస్తూ కూడా హైదరాబాద్/చెన్నై యాజమాన్యాలు ఎందుకు పట్టించుకోవటం లేదు. స్థానిక యాజమాన్యమే పనిగట్టుకోని వారిని పంపుతోదని అందరికీ తెలుసు. ఎందుకిలా?.. సమాధానానికై చూస్తూనే ఉండండి ఎబౌట్ తెలుగు మీడియా..

ఆ ఒక్క సొసైటీకే ఎందుకు ఇవ్వాలి?

ఇళ్ళ స్థలాల కోసం జర్నలిస్టులు చేస్తున్న ప్రయత్నాల్లో సరి కొత్త నాటకం మొదలైంది. ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న సొసైటీలను కాదని జవహర్ లాల్ నెహ్రు పేరిట వెలిసిన కొందరు పైరవీ కారుల సొసైటీకి స్థలాన్ని ఇస్తుందట. అసలు ఈ సొసైటీకి మాత్రమే ఉన్న ప్రత్యేక అర్హత ఏమిటి? జర్నలిస్టుల నేతలుగా చెలామని అవుతున్న కొందరు పైరవీకారులు ముఖ్యమంత్రిని ప్రభావితం చేసి తాము ఏర్పాటు చేసిన సంకర సొసైటీకి మాత్రమే ఇళ్ళ స్థలాలు దక్కించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ఉనికిలో ఉన్న జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీల్లోని సభ్యులంతా తమ సొసైటీల సభ్యత్వాలకు రాజీనామా ఇచ్చి ఈ సంకర సొసైటీలో చేరాలట. దరఖాస్తు ఫారాలు కూడా కొందరికే లిమిటెడ్ గా ఇస్తారట. ఎవరీ వంశీ? ఎవరీ భాస్కర్? ఈ సంకర సొసైటీలో ఎలక్ట్రానిక్ మీడియా హౌసింగ్ సొసైటీ సభ్యుల్ని చేర్పించేందుకు ఇండియా టీవీ శ్రీనివాస్ రెడ్డి , సాబేర్ ఎందుకు తాపత్రయ పడుతున్నారు? కేవలం జూబ్లీహిల్స్ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ అక్రమార్కులపై కోపంతో మొత్తం జర్నలిస్టుల ప్రయోజనాలకే ఎందుకు ముప్పు తల పెడుతున్నారు? అసలు ముక్యమంత్రిగారు ఈ గోముఖ వ్యాఘ్రాల్ని ఎలా నమ్మారు? ఇప్పటికే ఉన్న జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీలను కాదని ఈ సంకర సొసైటీకి ప్రభుత్వం ఏ ప్రాతిపదికన ఇళ్ళ స్తలాలు ఇస్తోంది? రేపు ఎవరినా న్యాయస్థానంలో సవాలు చేస్తే జరగబోయే పరిణామాలకు ఎవరిది బాధ్యత?
తెలంగాణా కోణం
ఇళ్ళ స్థలాల కేటాయింపులో తమకు జరగబోతున్న అన్యాయాన్ని పసిగట్టిన తెలంగాణా జర్నలిస్టులు పోరాటానికి సిద్దం అవుతున్నారు. వీరికి టి.ఆర్.ఎస్. అభయ హస్థం కూడా లభించిందట. హైదరాబాద్లో చాలా ఏళ్ళుగా పని చేస్తున్న తమకు వలస జర్నలిస్టుల కారణంగా పొంచి ఉన్న ముప్పును వీరు పసిగట్టి ఇప్పుడే అప్రమత్తం అయ్యారు.