Monday, May 11, 2009

కమ్ముకుంటున్న సంక్షోభ ఛాయలు

అంతా అనుకున్నట్లే ఎలక్ట్రానిక్ మీడియాలో సంక్షోభంప్రారంభం అయింది. ఎన్నికలు ముగిసి ఫలితాలైనా రాకమునుపే యాజమాన్యాలు ఉద్యొగాలకు కోత పెట్టడం ప్రారంభించాయి. ఎన్-టీవీలో పలువురు జర్నలిస్టులకు ఉద్వాసన పలికారు. అదే బాటలో లోకల్ టీవీ సిబ్బందిని తగ్గించుకుంది. టీవీ-9లో కుడా సిబ్బందిని తగ్గించే ఆలోచన ఉన్నట్లు తెలుస్తోంది. జీ 24 గంటలు చానెల్ లోని జర్నలిస్టులకు జీతంలో 15 శాతం కోత విధించారు. జెమిని సిబ్బంది ఇంక్రిమెంట్ ముష్టి 5 శాతం మాత్రమే పెరిగింది. కొత్తగా వచ్చిన ఐ-న్యూస్ సిబ్బందికి జీతాల చెల్లింపులో జాప్యం జరుగుతోంది. ఎన్నికల తర్వాత ఈ చానెల్ పరిస్థితి ఏమిటో అర్థం కావడం లేదు. అదే బాటలో హెచ్.ఎం.టీవీ పరిస్థితి కూడా. టీవీ5 చానెల్ పై కూడా అనుమానపు మేఘాలు కమ్ముకున్నాయి. తెలుగు చానెల్లన్నీ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నయి. ఎన్నికల పుణ్యమా అని ఇంత కాలం నెట్టు కొచ్చిన యాజమాన్యాలు ఇక నిర్వహణా భారాన్ని తగ్గించుకోవడం పై ద్రుష్టి పెట్టాయి. ఇందులో భాగం గానే ఉద్యోగుల కుదింపు, జీతాల తగ్గింపు.

టికెట్ల కేటాయింపులో జర్నలిస్టులకు మొండి చేయి

అసెంబ్లీలో మైక్ పట్టుకొని 'అధ్యక్షా..' అని మాట్లాడదామని కలలు కన్న పలువురు జర్నలిస్టులకు రాజకీయ పార్టీలు మొండి చేయి ఇచ్చాయి. ఇంత కాలం తాము ఆ పార్టీలను నమ్ముకొని చేసిన చాకిరీకి ఇదా ప్రతిఫలం అంటూ వాపోతున్నారు పాపం. ముఖ్యంగా ముగ్గురు జర్నలిస్టులకు టికెట్లు ఇస్తామని ప్రచారం చేసుకున్న టి.ఆర్.ఎస్. రామలింగారెడ్డికి తిరిగి టికెట్ ఇవాడం తప్ప కొత్తగా ఎవరికి ఇవ్వలేదు. ఆంధోల్ నుండి టికెట్ ఆశించి భంగపడ్డ టీవీ జర్నలిస్ట్ క్రాంతి ఇండిపెండెంట్ గా బరిలోకి దిగాడు. టికెట్ కోసం ప్రయత్నించిన సీనియర్ జర్నలిస్ట్ అయోధ్య రెడ్డికి సైతం మొండిచేయి ఇచ్చారు. తెలంగాణా వాదినంటూ డబ్బా కొట్టుకునే మాజీ కమ్యూనిస్టు పల్లె రవికి అటు కె.సి.ఆర్. ఇటు దేవేందర్ గౌడ్ చేయి ఇచ్చారట. తెలుగు దేశం కొత్తగా ఏ జర్నలిస్టుకు టికెట్ ఇవ్వలేదు. టీవీ5 రిపోర్టర్ కప్పర ప్రసాద్ కొద్దిలో బి.జె.పి. టికెట్ మిస్సయాడు. ఇతగాడు టికెట్ వస్తుందనే ఆశతో టీడీపీ, కాంగ్రేస్ అభ్యర్థులతో ఒప్పందాలు కూడా కుదుర్చుకున్నాడట. ప్రజారాజ్యం పార్టీ ఒక్కటే నమ్ముకున్న కన్న బాబుకు టికెట్ ఇచ్చి రుణం తీర్చుకుంది.

కంట్రిబ్యూటర్ల పొట్టగొట్టిన 'స్పేస్ సెల్లింగ్'

ఎన్నికల్లో అంతో ఇంతో వెనుకేసుకుందామని ఆశ పడ్డ తెలుగు దిన పత్రికల కంట్రిబ్యూటర్లు, స్ట్రింగర్లకు చుక్కెదురైంది. ఎన్నికల్లో అభ్యర్థులు ప్రకటనలు ఇవ్వడానికి వ్యయపరిమితి అడ్డు రావడంతో దిన పత్రికల యాజమాన్యాలు 'స్పేస్ సెల్లింగ్' పేరిట వార్తలను అమ్మకానికి పెట్టాయి. ఫలితంగా ఎన్నికల్లో పోటీ చేసతున్న అభ్యర్థులంతా భారీగా చెల్లించి ధర్జాగా వార్తలు రాయించుకున్నారు. ' దూసుకెల్ల్తున్న మల్లాయ్య..' 'ఎదురులేని పుల్లాయ్య..' 'ఎల్లయ్య విజయం ఖయం..' లాంటి వార్తలు ఈకోవలోనివే. ఏకంగా పత్రికల యాజమాన్యాలే స్పేస్ సెల్లింగ్ పేరిట డబ్బులు తీసుకొని వార్తలు ఇవ్వడంతో కంట్రిబ్యూటర్లు, స్ట్రింగర్లకు అభ్యర్థుల నుండి మొండి చేయి ఎదురైంది. అయితే టీవీ చానెల్ల రిపొర్టర్లు, స్ట్రింగర్లు బాగానే వెనుకేసుకున్నారట.