Sunday, January 11, 2009

' స్టూడియో-ఎన్ ' లో దళారీలు (updated)

భారీ ఎత్తున దూసుకు వస్తున్నట్లుగా ప్రచారం జరుగుతున్న ' స్టూడియో-ఎన్ ' న్యూస్ చానెల్లో అసలేం జరుగుతోందని మీడియా సోదరులందరూ ప్రశ్నించుకుంటున్నారు. ఈ ఛానెల్ న్యూస్ హెడ్ శివరామ ప్రసాద్ అధికారాలకు యాజమాన్యం కత్తెర పెట్టినట్లు తెలుస్తోంది. బహుషా ఆయన బయటకు వెళ్ళ వచ్చనే ప్రచారం కూడా జరుగుతోంది. సీటీవీకి చెందిన అంజయ్య, జయప్రసాద్ ల బ్యాచ్ స్టూడియో-ఎన్ లో చేరారని తెలియగానే ఇక ఈ చానెల్ పని అయిపోయిన్నట్లే అనే వ్యాఖ్యానాలు మీడియాలో వినిపిస్తున్నాయి. దళారీ పనుల్లో నిష్ణాతులైన సీటీవీ బ్యాచ్ ను నార్నె యాజమాన్యం ఎలా నమ్మినట్లు? అసలు వీరి గురించి సరిగ్గా విచారించే తీసుకున్నారా? అంజయ్య దళం స్టూడియో-ఎన్లో చేరటంతో ఇప్పటి వరకూ ఈ చానెల్లో చేరదామని ప్రయత్నించిన సీనియర్ జర్నలిస్టులు తమ ప్రయత్నాలకు ఫుల్ స్టాప్ పెట్టుకున్నారు. నగరానికి దూరంగా మనికొండలో ఉన్న ఈ చానెల్లో చేరితే ప్రయాణానికే రోజంతా పడితుంది. పైగా జీతాలు కూడా అతి తక్కువగా ఆఫర్ చేస్తునారు. ఈ గొడ్డు చాకిరి ఎవరు పడతారని సీనియర్లు స్టూడియో-ఎన్ కు దూరంగా ఉంటున్నారు. అంజయ్య దళం సీటీవీలోని ఉన్న సాబేర్ తదితర అనుయాయుల్ని, ఎలక్టానిక్ మీడియా ఓనమాలు తెలియని ప్రింట్ మిత్రుల్ని స్టూడియో-ఎన్ లో దింపే ప్రయత్నాల్లో ఉంది.