Sunday, July 29, 2007

బురద చల్లం కానీ ఉతికేస్తాం..

అతి కొద్ది సమయంలోనే 'ఎబౌట్ తెలుగు మీడియా' పాపులర్ కావడం మాకు సంతోశాన్నిస్తోంది. ఈ సందర్భంగా మా బ్లాగ్ వీక్షకులకు ఒక విశయాన్ని మనవి చేయదలచుకున్నాం.. మీడియాలో మాకు గిట్టని వర్గాలను టార్గెట్ చేసుకొని బురద చల్లడం మా అభిమతం కాదు.. అలాగని జరుగుతున్న అన్యాయాన్ని చూస్తూ ఊరుకోం.. మీడియాలో చోటు చేసుకునే పరినామాలను, మంచీ-చెడులను నలుగురితో పంచుకునేందుకే ఈ బ్లాగ్ ఏర్పాటు చేశాం.. జర్నలిస్టులకు జరుగుతున్న అన్యాయాలను (తోటి జర్నలిస్టులతో కూడా) ఎదిరించడం మా ప్రధాన లక్ష్యం. వ్యక్తిగత నిందలకు మేం దూరం.. అయితే జర్నలిస్టులకు ద్రోహం చేస్తున్నవారిని చూస్తూ ఊరుకోం.. రాతలతో తగిన విధంగా వాతలు పెడతాం.. ఈ పోరాటం మా ఒక్కరిదే కాదు.. జర్నలిస్టులందరిది.. మాకు ఆశీసుల్లందించండి.
మీ వద్ద ఉన్న సమాచారాన్ని మాకు రెండు మార్గాల ద్వారా అందించ వచ్చు. ప్రతి వార్త కింద ఉండే comments ని క్లిక్ చేసి పంపవచ్చు. లేదా atmap@rediffmail.com కి మెయిల్ చేయండి.

శర్మకు శత్రువులెందుకు?

తెలుగు మీడియా బ్లాగులాలో మంచికో, చెడుకో అందరికన్నా ఎక్కువగా కనిపించే పేరు శర్మదే అంటే అతిశయోక్తి కాదు. ఆయన వ్యవహారశైలే అందుకు కారణం. జర్నలిస్టుల్లో అవినీతిపరులకు కొదవలేదు. అయితే అందరూ శర్మ వెంట ఎందుకు పడుతున్నారు? మీడియాలో శర్మకు మిత్రులు చాలా తక్కువ. ఉన్నా బయట పడరు. ఏ జర్నలిస్టుకు లేనంతగా ఆయనకు శత్రువులున్నారు. ప్రతి ఒక్కరితో తగాదాలు పెట్టుకోవడం, అందరినీ అనుమాన దృష్టితో చూడటమే ఇందుకు కారణం. అందుకే మీడియా బ్లాగులకు ఆయన టార్గెట్ అయ్యాడు. శర్మ ఇకనైనా తన పద్దతులు మార్చుకుంటే సమాజానికి, ముఖ్యంగా మీడియాకు మంచిది..
కొసమెరుపు: అందరు అనుకుంటున్నట్లుగా శర్మ మాటీవీకి ఇంకా రాజీనామా చేయలేదు. స్పెషల్ కరస్పాండెంట్ హోదాలో ఆఫీస్లోనే ఒక మూల కూర్చొని కాలక్షేపం చేస్తున్నడని మాటీవీ వర్గాల భోగట్టా. జెమినిలో ఢిల్లీ రిపొర్టర్ పోస్టు కోసం ప్రయత్నాలు మాత్రం జోరుగా జరుపుతున్నాడని తెలిసింది.

Thursday, July 26, 2007

మాటీవీ జీతాలు పెరిగాయి.. బ్యూరోచీఫ్..సత్యనారాయణ

ఎట్టకేలకు మాటీవీ న్యూస్ సిబ్బంది జీతాలు పెరిగాయి. 50 నుండి 100 శాతం దాకా పెరిగిన వేతనాలు 'మా' జర్నలిస్టులకు ఆనందాన్ని కలిగించాయి. పెరుగుదల ఈ స్థాయిలో ఉంటుందని ఎవరూ ఊహించి ఉండరు. మాటీవీలో ఇతర డిపార్ట్ మెంట్ల సిబ్బందికి గతంలోనే వేతనాలు పెంచారు. న్యూస్ వారికి జీతాల పెరుగుదలో జాప్యం వల్ల ఎన్నో అపోహలు, వదంతులు వినిపించాయి. ఈ కారణంగానే భావనారాయణ రాజీనామా ఇచ్చిన విశయం అందరికి తెలిసినదే..
మాటీవీ బ్యూరోచీఫ్ గా ఎవరు రానున్నరనే ఊహాగానాలకు తెరదించుతూ మాటీవీ డెస్క్ సీనియర్ సబ్ ఎడిటర్ సత్యనారాయణకు ఆ బాధ్యతలు అప్పగించారు.
మాటేవీ జర్నలిస్టుల జీతాలు భారీగా పెరగటం జెమిని ఉద్యోగులకు ఇబ్బందిని కలిగించింది. పాపం వారు ఇంతకన్నా చేయగలిగేది ఏం ఉంటుంది. మతిలేని యాజమాన్యాన్ని నిందించుకోవడం తప్ప..

Saturday, July 21, 2007

గొర్రెతోక బెత్తెడు..జెమిని జీతం..

ఎలక్ట్రానిక్ మీడియాలో అత్యంత నికృష్ట జీతాలు ఇచ్చే సంస్థగా 'జెమిని ' పేరు తెచ్చుకుంది. లోకల్ కేబుల్ చానళ్ళలో కూడా అంత తక్కువ వేతనాలు ఉండవేమో. విలసాల కోసం డబ్బును మంచినీరులా ఖర్చు చేసే సన్-జెమిని యాజమాన్యం జర్నలిస్టులకు మంచి జీతాలు ఇచ్చే విషయంలో కక్కుర్తి పడుతోంది. వార్తా సేకరణ కోసం ప్రత్యేకంగా విమానాన్నే కొన్నట్లు చెప్పుకునే సన్ యాజమాన్యం తన గ్రూప్ లో అత్యంత ప్రధానమైన జెమిని న్యూస్ ఉద్యోగులకు కడుపు నిండా తిండి పెట్టే జీతాలు మాత్రం ఇవ్వదు. ఒకవైపు కొత్తగా వస్తున్న చానళ్ళు మంచి జీతాలు అఫర్ చేస్తుంటే సిబ్బందిని కాపాడుకునే ప్రయత్నం కూడా చేయడంలేదు. ఇప్పటికే 75 శాతం ఉద్యోగులు సంస్థను వదిలిపోయినా సన్-జెమిని యాజమాన్యంలో చలనం లేదు. కెమెరామెన్ల జీతాలయితే మరీ ధారుణంగా ఉన్నాయి. హైదరాబాద్ స్ట్రింగర్లకు చేరి మూడేళ్ళయినా ఇంత వరకు రెమ్యునరేషన్ ఇవ్వక పోవడంతో పైరవీలు చేసుకొని పొట్టనింపుకుంటున్నారు. కొత్తగా తీసుకుంటున్న సిబ్బందికి పాతవారికన్నా ఎక్కువ జీతాలు నిర్నయించడంతో సీనియర్లు కొత్త ఉద్యోగాలు వెతుక్కోవడంలో నిమగ్నమైనారు. పే-ఛానల్స్ రూపంలో రాష్ట్రం నుండి కోట్లాది రూపాయలు కొల్లగొడుతున్న తమిళ సన్ యాజమాన్యం తమ తెలుగు ఛానల్ జెమిని ఉద్యోగులకు సరైన వేతనాలు ఇవ్వకపోవడం ధారుణం. ఏడాది కాలంగా ఊరిస్తూ ఇటీవలే పెంచిన్ జీతాలపై ఉద్యోగులంతా అసంత్రుప్తితో ఉన్నారు. పెరిగింది గొర్రెతోకంతే.. గ్రేటర్ హైదరాబాద్ ఏర్పడ్డాక నగరంలో, శివారు ప్రాంతంలో అద్దెలు రెండింతలైనాయి. ఈ పరిస్తుతుల్లో జెమిని ఉద్యోగులు నగరంలో బతకలేని పరిస్తితులు ఏర్పడ్డాయి.
( జెమిని జీతంతో బతకలేక కొత్తగా రానున్న ఛానల్లో చేరిన జర్నలిస్ట్ ఇచ్చిన సమాచారం ఆధారంగా )

Thursday, July 19, 2007

కొత్త పత్రికల భవిశ్యత్తు ఏమిటి?

సాక్షి, సూర్య పత్రికలపై మీడియా వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. 'ఆ' రెండు పత్రికలకు పోటీగా వస్తున్న ఈ పత్రికలు జర్నలిస్టులకు జీతాలు పెద్ద మొత్తంలో ఎర వేస్తున్నాయి.. ఈ విశయంలో జర్నలిస్టులంతా హాపీగానీ ఉన్నారు, కానీ కాంగ్రెస్ పార్టీ అండ దండలతో వస్తున్న ఈ పత్రికల భవిశ్యత్తు ఏమిటి అని కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో రెండేళ్ళ తర్వాత కర్మగాలి కాంగ్రెస్ అధికారాన్ని కోల్పోతే పరిస్తితి ఏమిటి?. వై.ఎస్. సర్కారు ఇప్పుడు ఈనాడును ముప్పుతిప్పలు పెడుతున్నట్లే తెలుగుదేశం ప్రభుత్వం సాక్షి, సూర్యల పని పట్టదా?. ఆమెన్ పాపము శమించు గాక.. జర్నలిస్టు ఎక్కడ పని చేస్తున్నా క్షేమంగా ఉండాలనే కోరుకుందాం.. కాని అధిక జీతాలకు ఆశ పడి తొందర పాటు నిర్నయాలు తీసుకోవద్దనే మా సలహా..

Wednesday, July 18, 2007

'మా' శర్మ ఔట్.. 'జెమిని 'లో పైరవీలు..

మాటీవీ బ్యూరో చీఫ్ రాజేశ్వర్ శర్మ ఆ సంస్థకు గుడ్ బై చెప్పినట్లు తెలుస్తోంది. 'మా' కర్మగా పేరు తెచ్చుకున్న శర్మ అవమానకర పరిస్తితుల్లో విధులకు డుమ్మ కొట్టాల్సివచ్చింది. ప్రతి ఒక్కరిని అనుమాన దృష్టితో చూసే శర్మ శాడిజానికి విసుగెత్తిన రిపోర్టర్లంతా యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. శర్మ అవినీతి వ్యవహారాలను తెలుసుకున్న 'మా' యాజమాన్యం ఆయన్ని స్పెషల్ కరెస్పాండెంట్ గా రివర్ట్ చేసింది. దీన్ని ఎంతో అవమానంగా భావించిన శర్మ ఆ 'మా' నుండి వైదొలగాలని నిర్నయించుకున్నట్లు తెలుస్తోంది. వెలుతూ వెలుతూ శర్మ అందరికి మిఠాయిలు పంచాడట. శర్మను సాగనంపటంలో 'విస్సా శ్రీధర్ ' పాత్ర ఉందని తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం రాజేశ్వర్ శర్మ తన మాతృ సంస్థ 'జెమిని ' కి బ్యూరోచీఫ్ గా వెల్లేందుకు చెన్నై వెళ్ళి పైరవీలు చేస్తున్నాడు. ఇక జెమినిన్యూస్ సిబ్బందిని ఆ దేవుడే కాపాడాలి. పూర్వాశ్రమంలో జెమిని రిపోర్టర్లు కూడా కర్మ బాధితులే..

Saturday, July 7, 2007

మరిన్ని సంచలన మీడియా వార్తలు, విశేషాలతో మీ ముందుకు వస్తోంది 'ఎబౌట్ తెలుగు మీడియా'.. మీకు తెలిసిన సమాచారాన్ని పోస్ట్ చేయండి. ఈ బ్లాగ్ లో ప్రచురిస్తాం..