Sunday, June 22, 2008

పుట్టుకొస్తున్న కొత్త ఛానెళ్ళు.. జర్నలిస్టుల కొరత..

కొద్ది వారాల్లో మరి కొన్ని కొత్త న్యూస్ ఛానెళ్ళు వస్తున్నాయి. ఇప్పటికే ఉన్న ఈటీవీ(ఈటీవీ2), టీవీ9, జెమిని(జెమిని న్యూస్), టీవీ5, ఎన్-టీవీ, జీ తెలుగు, మా టీవీ, విస్సా లకు తోడుగా ఆసియానెట్ సితార, మా24, జీ తెలుగు24, సాక్షి టీవీ, టి-టీవీ, ఐ-టీవీ, సి.బి.సి., ఆర్ టీవీ త్వరలోనే రాబూతున్నాయి. అసలు ఇన్ని ఛానెళ్ళు మనగలవా అనే విషయాన్ని పక్కన పెడితే అసలు తెలుగు మీడియాలో వీటన్నింటికీ జర్నలిస్టులు (నాణ్యమైన) దొరుకుతారా అనే అనుమానం కలుగుతోంది. ఈ కొరతను అదిగమించడానికి కొన్ని ఛానెళ్ళు కొత్త వారిని చేర్చుకొని శిక్షణ ఇస్తున్నాయి. సో తెలుగు జర్నలిజానికి మంచి రోజులు వచ్చాయి. బోలెడన్ని ఉపాధి అవకాశాలు, మంచి మంచి జీతాలు లభిస్తున్నాయి. కానీ.. ఈ ఛానెళ్ళలో ఎన్నికల తర్వాత ఎన్ని ఉంటాయన్నదే ప్రశ్న.

స్టింగు రంగడి ఛానెల్..

రాజశేఖర్.. ఈ పేరు గుర్తుందా?.. టీవీ-9లో కో ఆర్డినేటర్ గా పని చేసిన ఈ వ్యక్తిని అవినీతిపరుడిగా ఆధారాలతో సహా నిరూపించి ఇంటికి పంపారు. స్టింగర్లు, రిపోర్టర్ల నుండే కాకుండా రాజకీయ నాయకులు, వ్యాపార, విద్యా సంస్థలు.. ఒకరేమిటి ఎవర్నీ వదలకుండా మామూళ్లు వసూలు చేసేవాడని రాజశేఖర్ కు పేరుండేది. ఒకానొక విద్యాసంస్థ అక్రమాలపై టీవీ-9 విలేఖరి ఒకరు స్టోరీ చేయడానికి వెల్లితే సదరు కాలేజీవారు అతన్ని బంధించి దేహశుద్ది చేశారు. జర్నలిస్ట్ సంఘాల నిరసన, పోలీసు, టీవీ-9 సిబ్బంది విచారణ అనంతరం సదరు కాలేజీకి, రాజశేఖర్ కు ఉన్న రుణానుబంధం బయట పడింది. ఆ తర్వాత రాజశేఖర్ వ్యవహారాలపై నిఘా పెట్టిన టీవీ-9 సిబ్బంది, ఇతగాడు ఓ నాయకుని దగ్గర లంచం తీసుకుంటుండగా స్పై కెమరాతో స్టింగ్ ఆపరేషన్ జరిపి మరీ పట్టుకున్నారు. ఇలా తొలగించబడ్డ రాజశేఖరుడు సి.ఇ.ఓ.గా సరికొత్త న్యూస్ చానెల్ రాబోతుంది. మనం పైన చెప్పుకున్న విద్యా సంస్థే ఈ చానెల్ను స్పాన్సర్ చేస్తొందిట. రాజశేఖరుని చానెల్లో స్టింగ్ ఆపరేషన్లు ఉంటాయా?..

సుమన్ కొత్త ఛానెల్ పెడతారా?


Tuesday, June 3, 2008

మూతపడ్డ సిటీకేబుల్

గత కొద్ది వారాలుగా రాష్ట్ర రాజధానిలో జరిగే కార్యక్రమాలు, ప్రెస్ మీట్లలో సిటీకేబుల్ మైక్ లోగోలు కనబడటం లేదేమిటా అని ఆలోచిస్తున్నారా?ఆంధ్ర ప్రదేశ్ లో ఎలక్ట్రానిక్ మీడియా(ప్రైవేట్)కు శ్రీకారం చుట్టిన సిటీకేబుల్ ఇక లేదు. నడపడం చేత కాక 'జీటీవీ' యాజమాన్యం ' సిటీకేబుల్ 'కు పాతరేసింది. 1995-96లలో విజయవాడలో రామకృష్ణ ప్రారంభించిన మాస్టర్ కేబుల్ ను టేకోవర్ చేసిన జీటీవీ సుభాష్ చంద్ర సిటీకేబుల్ పేరిట విస్తరించారు. ఆ తర్వాతి కాలంలో హైదరాబాద్ లో ప్రారంభమైన సిటీకేబుల్ ఎంతో పాపులారిటీ తెచ్చుకుంది. ఏలక్ట్రానిక్ మీడియాలో రవి ప్రకాశ్ (ప్రస్థుత టీవీ9 సీఈవో) కెరీర్ మొదలైంది సిటీకేబుల్ నుండే. రాజకీయనేతలు, అధికారులు, ప్రజలు సిటీకేబుల్ వార్తల కోసం ఆసక్తిగా చూసే వారు. సిటీకేబుల్ సిబ్బంది రానిదే ప్రెస్ మీట్లు కూడా ప్రారంభమయ్యేవి కాదు. క్రమంగా శాటిలైట్ చానెళ్ళు జెమిని, ఈటీవీ, ఇతర కేబుల్ నెట్ వర్క్ లు ఇన్ కేబుల్, సీ చానెల్ వచ్చాక సిటీకేబుల్ ప్రాభవానికి గ్రహణం ప్రారంభమైంది. 'జీ'యాజమాన్యం సిటీకేబుల్ ను టెక్నాలజీ పరంగా అభివృద్ది చేయడంపై సరయిన దృష్టి పెట్టక పొవడం, దివంగత రామకృష్ణ లాంటి సమర్ధిలైన మేనీజింగ్ డైరెక్టర్లు, బాస్లు లేక పొవడం ఇందుకు కారణం. జీ యాజ్మాన్యం సిటీకేబుల్ కు నియమించిన బాస్లంతా అసమర్ధంగా వ్యవహరించడం, తోటి కేబుల్ నెట్ వర్క్ లకు కోవర్టులుగా మారటం కూడా మరో కారణం అని అక్కడి సిబ్బంది చెబుతున్నారు. సిటీకేబుల్ మూత పడ్డా, అక్కడి న్యూస్ సిబ్బందిని జీన్యూస్ లోకి తీసుకోవడం గుడ్డిలో మెల్ల.

పుత్రోత్సాహము తండ్రికి..






ఎవరా బాడుగ నేతలు?

ఆంధ్రజ్యోతి దినపత్రిక కార్యాలయంపై జరిగిన దాడి, పత్రికా స్వేచ్చపై దాడి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆ పత్రిక ప్రచురించిన బాడుగ నేతల స్టొరీ కారణంగానే ఈ దాడి జరిగిన విషయాన్ని ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. అయితే బాడుగ నేతల స్టోరీ కొంత డొంకతిరుగుడుగా ఉంది. ఈ స్టోరీలో నాయకుల పేర్లు ఎందుకు నేరుగా చెప్పలేదు? ఆ పేర్లేవో చెప్పక పోవడం వల్ల బడుగు వర్గాల నేతలంతా ఇంతే అన్న అర్థం రాదా? మంద కృష్ణ జరిపిన దాడిని ఖండించాల్సిందే .. అదే సమయంలో ఆయన మీడియాపై చేస్తున్న ఆరోపణలు కూడా పరిశీలించాల్సిన అవసరం ఉంది.

బాడుగ జర్నలిజం (ఆంధ్రభూమి దినపత్రిక 31-05-2008)